Cricket Josh IPL బ‌ట్ల‌ర్ వేలంలోకి వ‌స్తే..ఆ టీమ్‌కే

బ‌ట్ల‌ర్ వేలంలోకి వ‌స్తే..ఆ టీమ్‌కే

బ‌ట్ల‌ర్ వేలంలోకి వ‌స్తే..ఆ టీమ్‌కే post thumbnail image

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెనింగ్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్‌..ఆ ఫ్రాంచైజీని వ‌దిలి ఆక్ష‌న్‌లోకి రావాల‌నుకుంటున్నాడ‌ట‌. ఒక‌వేళ అదే జ‌రిగితే ఈసారి జ‌ర‌గ‌బోయే మెగా ఆక్ష‌న్‌లో ఇత‌డికి జాక్‌పాట్ ద‌క్కే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ విన్న‌ర్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు చాలా ఉన్నాయి. అందులో ఆర్సీబీ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఇప్ప‌టికే ఓపెనింగ్ బ్యాట‌ర్ ఫాఫ్ డుప్లెస్సీని రిలీజ్ చేయాల‌నుకుంటున్న ఆర్సీబీ..ఆ స్థానాన్ని బ‌ట్ల‌ర్‌తో భ‌ర్తీ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌దు. విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్య‌త‌లు తిరిగి అప్ప‌గించేందుకు రెడీ అయిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా టీమ్‌ను పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేయాల‌ని చూస్తోంది. ఒక‌వేళ కేఎల్ రాహుల్‌ను తీసుకున్నా..బ‌ట్ల‌ర్‌నూ ద‌క్కించుకునే చాన్స్ ఉంది. ఎందుకంటే ఆసీస్ విధ్వంస‌క ఆట‌గాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను వ‌దులుకోవాల‌ని ఆర్సీబీ డిసైడైంది. గ‌త సీజ‌న్‌లో అత‌డు ఏ మాత్రం ఆక‌ట్టుకోలేదు. డుప్లెస్సీ, మ్యాక్స్‌వెల్‌ను వ‌దులుకుని ఆక్ష‌న్‌లో బ‌ట్ల‌ర్‌ను తీసుకుంటే స‌రి. ఎలాగూ విల్ జాక్స్ ఉండ‌నే ఉన్నాడు. లోయ‌ర్ మిడిల్ ఆర్డ‌ర్ కోసం మ‌రొక ఆల్‌రౌండ‌ర్‌ను తీసుకుంటే, ఆర్సీబీ ఫారిన్ కోటా బ్ర‌హ్మాండంగా త‌యార‌వుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

రివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలేరివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలే

గ‌త సీజ‌న్‌లో మూడుసార్లు కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..ఈ సీజ‌న్‌లోనూ కేకేఆర్ చేతిలో చిత్తైంది. గ‌త ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటుంది అనుకుంటే..త‌మ రేంజ్ స‌రిపోలేదంటూ మ‌రోసారి ఓడిపోయింది. బౌల‌ర్లు మ‌రోసారి నిరాశ‌ప‌రుస్తూ ప్రత్య‌ర్థి కేకేఆర్‌కు 200 ర‌న్స్ స‌మ‌ర్పించుకున్నారు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేసిన త‌ప్పు అదే..రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేసిన త‌ప్పు అదే..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయింగ్ లెవ‌న్ చూడ‌గానే ట‌క్కున క‌నిపెట్ట‌గ‌లిగే లోపం ఒక‌టుంది. అదే మ్యాచ్ విన్న‌ర్ లేక‌పోవ‌డం. గ‌త సీజ‌న్ వ‌ర‌కు జాస్ బ‌ట్ల‌ర్ రాయ‌ల్స్ త‌ర‌పున అద‌ర‌గొట్టాడు. అంత‌కు ముందు సీజ‌న్‌లో ఐతే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ఐతే ఈ

క‌ప్పు ముఖ్యం బిగిలు..క‌ప్పు ముఖ్యం బిగిలు..

ఈ న‌లుగురు యంగ్ ఇండియా కెప్టెన్స్‌..త‌మ త‌మ టీమ్స్‌ను ఐపీఎల్‌లో బ్ర‌హ్మాండంగా న‌డిపిస్తున్న తీరు చూస్తే..వీళ్ల‌లో ఒక‌రు క‌ప్పు కొట్ట‌డం గ్యారెంటీ అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్, గుజ‌రాత్ జెయింట్స్