సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ 38 బాల్స్లో 76 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. ఐతే థర్డ్ అంపైర్ ఇచ్చిన రనౌట్ నిర్ణయంపై గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔటైన అనంతరం డగౌట్కు వెళ్తూ అక్కడున్న ఫోర్త్ అంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..జీషన్ అన్సారీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతిని జాస్ బట్లర్ ఫైన్ లెగ్ వైపు తరలించి సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న శుభ్మన్ గిల్ క్రీజు చేరుకునే లోపే హర్షల్ పటేల్ వేసిన త్రో డైరెక్ట్గా వికెట్లను తాకింది. ఐతే థర్డ్ అంపైర్ రీప్లేలో ఆ బంతి వికెట్ కీపర్ క్లాసెన్ గ్లౌవ్ను తాకి వికెట్ల పక్కనుంచి వెళ్లినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో క్లాసెన్ గ్లౌవ్ వికెట్లను తాకింది. రెండు మూడు యాంగిల్స్లో చూసిన తర్వాత థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. గిల్ ఉద్దేశంలో వికెట్ కీపర్ క్లాసెన్ గ్లౌవ్ మాత్రమే వికెట్లను తాకిందని, బాల్ తాకలేదని వివరిస్తున్నాడు. ఐతే విశ్లేషకులు మాత్రం బాల్ సీమ్ వైపు వికెట్లను తాకిందని, అదే టైమ్లో క్లాసెన్ గ్లౌవ్ కూడా వికెట్లను తాకినట్టు చెబుతున్నారు.
రనౌట్పై గిల్ అసంతృప్తి

Related Post

నువ్వేం చేశావో అర్థమవుతోందా..?నువ్వేం చేశావో అర్థమవుతోందా..?
ఇషాన్ కిషన్ .అతి పెద్ద పొరపాటు చేసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అప్పటికే సన్రైజర్స్ టీమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయి..తిప్పలు పడుతోంది. ఆ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్, దీపక్ చహార్ బౌలింగ్లో

కప్పు ముఖ్యం బిగిలు..కప్పు ముఖ్యం బిగిలు..
ఈ నలుగురు యంగ్ ఇండియా కెప్టెన్స్..తమ తమ టీమ్స్ను ఐపీఎల్లో బ్రహ్మాండంగా నడిపిస్తున్న తీరు చూస్తే..వీళ్లలో ఒకరు కప్పు కొట్టడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ జెయింట్స్

చెపాక్లో విజిల్ మోతచెపాక్లో విజిల్ మోత
చెన్నై సూపర్ కింగ్స్ సొంతగ్రౌండ్ చెపాక్లో శుభారంభం చేసింది. 5 టైమ్స్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై హిట్మ్యాన్ రోహిత్ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. రోహిత్ డకౌట్ అయిన తర్వాత ముంబై బ్యాటర్లు వరుస విరామాల్లో