హమ్మయ్య.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొత్తానికి సొంతగడ్డపై మ్యాచ్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో 3 ఓడిపోగా..ఈసారి గెలుపుతో ఆ బ్యాడ్ సెంటిమెంట్కు స్వస్తి పలికింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (70), దేవ్దత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో టిమ్ డేవిడ్ (23), జితేశ్ శర్మ(20) దూకుడుగా ఆడి రెండొందలు దాటించారు. 206 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో రాయల్స్ ఆరంభం అదరగొట్టినా..మళ్లీ పాత కథే రిపీట్ చేసింది. 49 రన్స్తో జైస్వాల్ టాప్ స్కోరర్ గా ఉండగా, జురేల్ (47) ఊరించి ఉసూరుమనిపించాడు. ఆర్సీబీ బౌలర్ జాష్ హేజిల్వుడ్ అద్భుతమైన బౌలింగ్తో టీమ్ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు.
ఇరగదీసి మరీ..ఇంట గెలిచింది

Related Post

అట్లుంటది సిరాజ్తోని..అట్లుంటది సిరాజ్తోని..
ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్..ప్రత్యర్థులకు ఇచ్చిపడేస్తున్నడు. తన మాజీ టీమ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీసి సత్తాచాటాడు. తను ఏడు సీజన్లపాటు ఆడిన టీమ్పై..అది కూడా చిన్నస్వామి స్టేడియంలో..ఆ వైబ్, ఆ స్వాగ్ మామూలుగా

లెటర్ ఉందా? చెక్ చేసిన సూర్యలెటర్ ఉందా? చెక్ చేసిన సూర్య
ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మడమ కాస్త ట్విస్ట్ అవడంతో..ఓవర్ మధ్యలో బ్రేక్ దొరికింది. అదే టైమ్లో సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ అభిషేక్శర్మ దగ్గరికి వెళ్లి అతడి

స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?
వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై..ప్లే ఆఫ్ దారిని ఇబ్బందికరంగా మార్చుకుంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ మేల్కోవాల్సిన టైమ్ ఇది. గుజరాత్ టైటన్స్తో సొంతగడ్డపై జరగబోయే మ్యాచ్లో విజయం సాధించి మళ్లీ గాడిలో పడాల్సిందే. ట్రావిస్ హెడ్ మినహా మిగతా టాపార్డర్ విఫలమవుతోంది. ఓపెనర్