కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఖండించారు. సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ కోసం టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తమ టీమ్స్, యావత్ భారత్ మొత్తం ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతోందని…వారి కుటుంబాలకు అండగా ఉండాలని వారు చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులు 28 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా దీనిపై దేశమంతా రగిలిపోతోంది.ఇటువంటి సమయంలో ప్రజలంతా శాంతి కోరుకోవాలని, మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇరుజట్ల ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్లు ధరించి వారి సానుభూతి ప్రకటించుకున్నారు. నిమిషం పాటు మౌనం పాటించారు.
ఉగ్రదాడిని ఖండించిన ముంబై, సన్రైజర్స్

Related Post

నువ్వేం చేశావో అర్థమవుతోందా..?నువ్వేం చేశావో అర్థమవుతోందా..?
ఇషాన్ కిషన్ .అతి పెద్ద పొరపాటు చేసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అప్పటికే సన్రైజర్స్ టీమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయి..తిప్పలు పడుతోంది. ఆ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్, దీపక్ చహార్ బౌలింగ్లో

ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?
ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఫారిన్ ప్లేయర్స్ జాక్పాట్ కొట్టడం చాలా సార్లు చూశాం. మరి ఈసారి మెగా ఆక్షన్లో ఎవరు ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్గా రికార్డు సృష్టిస్తారో ఒక అంచనా వేద్దాం. గతేడాది మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే 20

మళ్లీ మాజీ ప్రియుడే ఓడిస్తాడా?మళ్లీ మాజీ ప్రియుడే ఓడిస్తాడా?
ఈ సీజన్ ఐపీఎల్లో దాదాపు చాలా టీమ్స్కు వారి మాజీ ప్లేయర్స్ కొరకరాని కొయ్యలా తయారవుతున్నారు. ఇంకా చెప్పాలంటే మాజీ ప్లేయర్లే ఓటమిని శాసిస్తున్నారు. రివేంజ్ తీర్చుకుంటున్నారా? కసితో ఆడుతున్నారో తెలియదుగానీ, మాజీ టీమ్స్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మొన్నటి వరకూ