Cricket Josh IPL నితీశ్‌కు తొలిసారి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌

నితీశ్‌కు తొలిసారి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌

నితీశ్‌కు తొలిసారి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ post thumbnail image

బీసీసీఐ ప్ర‌తి ఏడాది ప్ర‌క‌టించే సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో..2024-25 ఏడాదికి సంబంధించి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి చోటు ద‌క్కింది. ఇక గ‌తేడాది బీసీసీఐ ఆగ్ర‌హానికి గురై కాంట్రాక్టు ద‌క్క‌ని శ్రేయ‌స్ అయ్య‌ర్, ఇషాన్ కిష‌న్‌కు ఈసారి మ‌ళ్లీ చోటు ద‌క్క‌డం విశేషం. టీ20ల నుంచి రిటైర్ అయిన రోహిత్‌శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, ర‌వీంద్ర జ‌డేజాను ఏ+ కేట‌గిరీలో చేర్చ‌డం కొస‌మెరుపు. ఎందుకంటే ఈ ముగ్గురూ టీ20ల‌కు గుడ్ బై చెప్ప‌డంతో ఈసారి ఏ కేట‌గిరీ ఇస్తార‌ని వార్త‌లు ప్ర‌చార‌మ‌య్యాయి. కానీ బీసీసీఐ వాటిని తోసిపుచ్చుతూ ఈ లెజండ‌రీ ప్లేయ‌ర్స్ ను ఉన్న‌త కేట‌గిరీలో చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి మ‌హ్మ‌ద్ సిరాజ్ (ఏ), తిల‌క్‌వ‌ర్మ‌(సి), నితీశ్‌కుమార్ రెడ్డి (సి) బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్టు లిస్టులో ఉన్నారు. ఇక‌ గ‌తేడాది గ్రేడ్ సీలో ఉన్న‌ శార్దూల్ ఠాకూర్, ఆవేశ్‌ఖాన్‌కు ఈసారి చోటు ద‌క్క‌లేదు.

నాలుగు కేట‌గిరీల్లో (ఏ+, ఏ, బీ, సీ) మొత్తం 34 మంది క్రికెట‌ర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. మూడు ఫార్మాట్ల‌లో ఆడిన వారికి, ఈ ఏడాది మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న క్రికెట‌ర్ల‌కు సెంట్ర‌ల్ కాంట్రాక్టు ఇచ్చి వారికి వేత‌నాలు చెల్లిస్తుంది బీసీసీఐ.

గ్రేడ్ ఏ+ ( ఏడాదికి రూ.7 కోట్లు)
రోహిత్‌శ‌ర్మ, విరాట్ కోహ్లీ, ర‌వీంద్ర జ‌డేజా, జ‌స్ప్రిత్ బుమ్రా

గ్రేడ్ ఏ (ఏడాదికి రూ. 5 కోట్లు)
మ‌హ్మ‌ద్ సిరాజ్, KL రాహుల్, శుభ్‌మ‌న్ గిల్, హార్దిక్ పాండ్య‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, రిష‌బ్ పంత్

గ్రేడ్ బీ ( ఏడాదికి రూ. 3 కోట్లు)
సూర్య కుమార్ యాద‌వ్, కుల్దీప్ యాద‌వ్, అక్ష‌ర్ ప‌టేల్, య‌శ‌స్వి జైస్వాల్, శ్రేయ‌స్ అయ్య‌ర్

గ్రేడ్ సీ (ఏడాదికి కోటి రూపాయ‌లు)
రింకూ సింగ్, తిల‌క్‌వ‌ర్మ‌, రుత్‌రాజ్ గైక్వాడ్, శివ‌మ్ దూబె, ర‌వి బిష్ణోయ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, ముకేశ్ కుమార్, సంజూ శాంస‌న్, అర్ష్‌దీప్ సింగ్, ప్ర‌సిద్ కృష్ణ‌, ర‌జ‌త్ ప‌టిదార్, ధృవ్ జురేల్, స‌ర్ఫ‌రాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిష‌న్, అభిషేక్‌శ‌ర్మ‌, ఆకాశ్ దీప్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, హ‌ర్షిత్ రాణా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఊహించిన‌ట్టుగానే ఐదుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ కోటాలో రిటైన్ చేసుకుంది. అందుకోసం రూ.4 కోట్లు చెల్లించింది. అంతేనా అని నోరెళ్లబెట్టొద్దు, చాలా లెక్క‌లుంటాయి అవి ఇప్పుడు

మ‌ళ్లీ త‌క్కువకే..పంజాబ్ గెలిచిందిమ‌ళ్లీ త‌క్కువకే..పంజాబ్ గెలిచింది

పంజాబ్ కింగ్స్‌కు వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ లో స్కోరింగ్ ఎన్‌కౌంట‌ర్‌ను చ‌విచూసింది. గ‌త మ్యాచ్‌లో కేకేఆర్‌పై 111 ర‌న్స్ డిఫెండ్ చేసుకున్న పంజాబ్…ఈసారి ఆర్సీబీపై 96 ర‌న్స్‌ను కొంచెం క‌ష్టం..కొంచెం ఇష్టంగానే చేజ్ చేసింది. నెహాల్ వ‌ధేరా (19 బాల్స్‌లో 33*,

ధోని వ‌ర్సెస్ కోహ్లీ..? కానే కాదుధోని వ‌ర్సెస్ కోహ్లీ..? కానే కాదు

టీమిండియా లెజెండ్స్ మ‌హేంద్ర‌సింగ్ ధోని, విరాట్ కోహ్లీ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉండ‌బోతోందా? అంటే కానే కాదు..ఇద్ద‌రూ గ్రేట్ ప్లేయ‌ర్స్..జ‌స్ట్ గేమ్‌ను ఆస్వాదిస్తారంతే. ఇది ఓన్లీ సీఎస్కే వ‌ర్సెస్ ఆర్సీబీగానే చూడాలి. ముఖ్యంగా ధోని ఐపీఎల్‌లో త‌ప్ప ఇంకెక్క‌డా ఆడ‌టం లేదు..