Cricket Josh Matches టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్

టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్

టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్ post thumbnail image

బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా సంబ‌రాలు చూసే ఉంటారంతా.. కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ ట్రోఫీని ఆకాశ్‌దీప్‌కు ఇవ్వ‌డంతో అత‌డే ట్రోఫీని లిఫ్ట్ చేస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చాడు. ఇవాళ ఏ న్యూస్ పేప‌ర్ వెబ్‌సైట్‌లో చూసిన అవే ఫొటోలు..టీవీల్లో అవే విజువ‌ల్స్. ఐతే ట్రోఫీని టీమ్‌లో కొత్త‌గా వ‌చ్చిన‌వారికి కెప్టెన్ ఇవ్వ‌డ‌మ‌నేది మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ సెట్ చేసిన ట్రెండ్. 2014లో టెస్ట్‌ల‌కు, 2019లో వ‌న్డే, టీ20ల నుంచి ధోనీ రిటైర‌య్యాడు. ఐతే ఆ ట్రెండ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది.

2014 త‌ర్వాత టెస్ట్ కెప్టెన్సీ చేప‌ట్టిన విరాట్ కోహ్లీ కూడా మ‌హీ విధానాన్నే ఫాలో అయ్యాడు. ఆ త‌ర్వాత టెస్ట్ కెప్టెన్‌గా కొన‌సాగ‌తున్న రోహిత్‌శ‌ర్మ కూడా అదే ట్రెండ్ అనుస‌రిస్తున్నాడు. ఇలా ట్రోఫీని టీమ్‌లో కొత్త‌గా వ‌చ్చిన‌వారికి ఇవ్వ‌డం వెన‌క రీజ‌నేంటో కూడా అప్ప‌ట్లోనే ధోనీ రివీల్ చేశాడు. ఎవ‌రైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో..కొత్త‌గా టీమ్‌తో మింగిల్ అవుతుంటారో..వారికి ట్రోఫీ ఇవ్వ‌డం వ‌ల్ల వాళ్ల‌లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంద‌ని, ఫ్యూచ‌ర్‌లో మ‌రింత బాగా పెర్ఫార్మ్ చేయ‌డానికి తోడ్ప‌డుతుంద‌ని ధోనీ 2019లో చెప్పాడు. ట్రోఫీని ఎవ‌రు లిఫ్ట్ చేసినా, అంతిమంగా ఆ విజ‌యం టీమ్ మొత్తానికి చెందుతుంద‌న్నాడు. మొత్తానికి టీమిండియా కొన‌సాగిస్తున్న‌ ఈ ట్రెండ్ స్పూర్తితో మిగ‌తా ఆట‌ల్లోని టీమ్స్‌ని కూడా ఉత్తేజ‌ప‌రుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

వీరాభిమానుల మ‌న‌సు ముక్క‌లైంది..వీరాభిమానుల మ‌న‌సు ముక్క‌లైంది..

కాదా మ‌రి..ఎంత‌టి చ‌రిత్ర‌, ఎంత‌టి వైభం. అంద‌నంత ఎత్తు నుంచి ఒక్క‌సారిగా అట్ట‌డుగు పాతాళానికి ప‌డిపోయింది ఇండియా టెస్ట్ క్రికెట్. అది కూడా మ‌న సొంత‌గ‌డ్డ‌పై, తిరుగులేని రికార్డు ఉన్నా..అద్భుత‌మైన ఆట‌గాళ్లు ఉన్నా..న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బ‌తిన్న‌ది. ప‌క్క‌నున్న దేశం శ్రీలంక

డ‌కౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలిడ‌కౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలి

తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా ఏ జ‌ట్టుతో జ‌రుగుతున్న అన‌ధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. ఏడో నెంబ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ 6 బాల్స్ ఆడి ర‌న్స్ చేయ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. అంతేకాదు ఇండియా ఏ త‌ర‌పున ఏ

స‌న్‌రైజ‌ర్స్‌కు ‘డ‌బుల్’ ఒత్తిడిస‌న్‌రైజ‌ర్స్‌కు ‘డ‌బుల్’ ఒత్తిడి

అబ్దుల్ స‌మ‌ద్‌, రీసెంట్‌గా రంజీ మ్యాచ్‌లో రెండు సెంచ‌రీలు చేశాడు. జ‌మ్మూ క‌శ్మీర్ త‌ర‌పున ఆడుతున్న యంగ్ బ్యాట‌ర్ ఒడిశాపై రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచ‌రీలు బాదాడు. మంచి విష‌య‌మే క‌దా, ఐతే తెలుగు అభిమానుల్లోనూ కొంద‌రు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే