కోల్కత నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 20 బంతుల్లో 39 రన్స్ జోడించిన తర్వాత ప్రియాన్ష్ ఆర్యను కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఔట్ చేశాడు. ఇక అదే ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ను కూడా ఔట్ చేసి డబుల్ ఇంపాక్ట్ చూపించాడు హర్షిత్ రాణా. ఆ మరుసటి ఓవర్లోనే జాష్ ఇంగ్లిస్ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. ఇక పవర్ ప్లే ఆఖరి బంతికి ఊపుమీదున్న ప్రభ్సిమ్రన్సింగ్ను కూడా హర్షిత్ ఔట్ చేసి పంజాబ్ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో పంజాబ్ 54 రన్స్కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వధేరా, యాన్సెన్ కొన్ని రన్స్ జోడించినప్పటికీ వికెట్ల పతనం ఆగకపోవడంతో పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో 2 వికెట్లు తీశారు.
కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్

Related Post

నాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండినాయకుడొచ్చాడు..రికార్డులు లెక్కబెట్టండి
మహేంద్రసింగ్ ధోని..మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంతో క్రికెట్ ప్రపంచంలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం వరుస ఓటములతో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆసక్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్గా ఏదైనా చేయగల సమర్థుడు.

చెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చిందిచెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చింది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జట్ల మధ్య అంతకు ముందు చెన్నైలో మ్యాచ్ జరగగా..సీఎస్కే ముంబైని ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇలాఖా

గురితప్పని గుజరాత్గురితప్పని గుజరాత్
గుజరాత్…ఆవా దే (గుజరాతీ భాషలో తీసుకురండి)..వాళ్ల ట్యాగ్లైన్కు తగ్గట్టుగానే మరో 2 పాయింట్లను తీసుకొచ్చింది. టైటన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో వార్ వన్ సైడ్ చేసేసింది. మొదట బ్యాటింగ్ చేసి 20