చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థలా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ద ఫినిషర్ అనే ట్యాగ్ లైన్ను మళ్లీ గుర్తు చేశాడు. 167 పరుగుల టార్గెట్ను చెన్నై ఛేదించే క్రమంలో మ్యాచ్ ఒకదశలో లక్నోవైపు ఉందన్నట్టు అనిపించింది. ఒక ఎండ్లో శివమ్ దూబె తన సహజ శైలికి విరుద్ధంగా మెల్లగా ఆడుతున్నాడు. అదే టైమ్లో ధోని ఎంటరయ్యాడు. అప్పుడు గెలుపు ఈక్వేషన్ 30 బాల్స్లో 56 రన్స్ కావాలి. ధోని తొలి బాల్కి సింగిల్ తీసి..ఆ తర్వాత బాల్ నుంచి బౌండరీల కౌంట్ మొదలెట్టాడు. చివరి 12 బాల్స్లో 24 రన్స్కు ఈక్వేషన్ మారింది. దూబె 4, 6 కొట్టగా…అదే ఓవర్ను ధోని ఫోర్తో ముగించాడు. ఇక ఆరు బాల్స్లో 5 రన్స్ అవసరమయ్యాయి. గెలుపు సీఎస్కేకు సునాయసంగా చిక్కింది. ధోని 11 బాల్స్లో 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక శివమ్ దూబె 37 బాల్స్లో 43 రన్స్తో నాటౌట్గా ఉన్నాడు. ఇతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
ధోని..ద ఫినిషర్..అంతే

Related Post

మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?
థలా పగ్గాలు చేపట్టినా, సీఎస్కే తలరాత మాత్రం మారలేదు. కోల్కత నైట్రైడర్స్ చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. 5 సార్లు ఛాంపియన్గా గెలిచిన టీమ్..తమ సొంతగడ్డపై 20 ఓవర్లు ఆడినా 103 రన్స్ మాత్రమే చేయడమంటే..ఇంతకు మించిన ఘోర అవమానం మరొకటి

గుంటూరు కుర్రాడి అరంగేట్రం అదుర్స్గుంటూరు కుర్రాడి అరంగేట్రం అదుర్స్
మొన్ననే మనం అనుకున్నాం..చెన్నై సూపర్ కింగ్స్ గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ను ఆడిస్తే బాగుంటుందని…ఆ మ్యాచ్లో అవకాశం రాలేదు గానీ, లక్నో సూపర్ జెయింట్స్పై లక్ కలిసొచ్చింది..నిజమే ఎందుకంటే రుతురాజ్ గాయం కారణంగా లీగ్కు దూరమవడం..ఓపెనర్గా డెవాన్ కాన్వే విఫలమవుతుండటం…దీంతో బెంచ్పై

మళ్లీ తక్కువకే..పంజాబ్ గెలిచిందిమళ్లీ తక్కువకే..పంజాబ్ గెలిచింది
పంజాబ్ కింగ్స్కు వరుసగా రెండో మ్యాచ్లోనూ లో స్కోరింగ్ ఎన్కౌంటర్ను చవిచూసింది. గత మ్యాచ్లో కేకేఆర్పై 111 రన్స్ డిఫెండ్ చేసుకున్న పంజాబ్…ఈసారి ఆర్సీబీపై 96 రన్స్ను కొంచెం కష్టం..కొంచెం ఇష్టంగానే చేజ్ చేసింది. నెహాల్ వధేరా (19 బాల్స్లో 33*,