గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ హిమ్మత్ సింగ్ను రంగంలోకి దింపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్కు దూరమైన ఓపెనర్ మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ను లక్నో సూపర్ జెయింట్స్ ఆక్షన్లో హిమ్మత్సింగ్ను రూ.30 లక్షలకు దక్కించుకుంది. హిమ్మత్ గతేడాది చివర్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పెద్దగా రాణించకపోయినప్పటికీ..ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో అతని ప్రతిభకు పట్టం కట్టారని చెప్పొచ్చు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో కెప్టెన్గా అదరగొట్టి ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ రైడర్ జట్టుకు ట్రోఫీ అందించాడు. అంతేకాదు ఈ లీగ్లో ఎక్కువ రన్స్ సాధించిన లిస్ట్లో మూడో స్థానంలో ఉన్నాడు. పది మ్యాచుల్లో 381 రన్స్ చేయగా, అందులో 4 హాఫ్ సెంచరీలున్నాయి. స్ట్రైక్ రేట్ 165 కంటే ఎక్కువగా ఉండటం ప్లస్ పాయింట్. మరి లక్నో సూపర్ జెయిట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఢిల్లీ బాయ్ కదా..కొంచెం ఆట, కొంచెం లోకల్ సెంటిమెంట్ కూడా ఉండొచ్చేమో మరి..తప్పు లేదులే.
ఎవరీ హిమ్మత్ సింగ్..?

Categories:
Related Post

స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?
వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై..ప్లే ఆఫ్ దారిని ఇబ్బందికరంగా మార్చుకుంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ మేల్కోవాల్సిన టైమ్ ఇది. గుజరాత్ టైటన్స్తో సొంతగడ్డపై జరగబోయే మ్యాచ్లో విజయం సాధించి మళ్లీ గాడిలో పడాల్సిందే. ట్రావిస్ హెడ్ మినహా మిగతా టాపార్డర్ విఫలమవుతోంది. ఓపెనర్

కింగ్స్ ఫైట్ పంజాబ్దేకింగ్స్ ఫైట్ పంజాబ్దే
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీ సాయంతో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. వరుసగా

6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య..సెంచరీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇతడే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతకీ ఎవరీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండర్-19లోనూ తనదైన మార్క్ చూపించాడు. 2021లో దేశవాళీ టీ20లో