Cricket Josh IPL గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా.. post thumbnail image

చెన్నై సూప‌ర్ కింగ్స్‌, దాదాపుగా త‌మ ప్లేయింగ్ లెవ‌న్‌ను మార్చ‌దు. టీమ్ నిండా సీనియ‌ర్ ప్లేయ‌ర్సే ఉంటారు. డాడ్స్ ఆర్మీ అని పేరు కూడా ఉంది. ఐతే ఈ సీజ‌న్‌లో మిగ‌తా ఫ్రాంచైజీలు కుర్రాళ్ల‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇస్తున్నాయి. దిగ్వేశ్‌, విఘ్నేశ్‌, ప్రియాన్ష్‌, స‌త్య‌నారాయ‌ణ రాజు..ఇలా చాలా మందే ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కార‌ణంగా టోర్నీకి దూర‌మ‌వ‌డంతో ప్ర‌స్తుతం ఆ స్థానంలో ఎవ‌రిని ఆడిస్తార‌నేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ధోని నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నాడు క‌దా..
నిజానికి రాహుల్ త్రిపాఠి లేదా దీప‌క్ హుడాను ప్లేయింగ్ లెవ‌న్‌లో తీసుకోవ‌చ్చు. కానీ ఒక‌సారి బెంచ్ వైపు చూస్తే..తెలుగు కుర్రాడు షేక్ ర‌షీద్, త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స‌త్తాచాటిన ఆండ్రె సిద్ధార్థ్ క‌నిపిస్తారు.షేక్ ర‌షీద్ అండ‌ర్ 19 ప్రపంచ‌క‌ప్ 2022 గెలిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఆట‌గాడు. గుంటూరుకు చెందిన 20 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాట‌ర్..2023 నుంచి సీఎస్కే టీమ్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాడు. ఈ సీజ‌న్‌లో ఐనా అరంగేట్రం అవ‌కాశం ద‌క్కుంతుంద‌ని ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాడు. మ‌రి ఇవాళ కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో యంగ్‌స్ట‌ర్స్‌కు అవ‌కాశ‌మిస్తారా? లేదంటే సీనియ‌ర్ల వైపే మొగ్గు చూపుతారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేసిన త‌ప్పు అదే..రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేసిన త‌ప్పు అదే..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయింగ్ లెవ‌న్ చూడ‌గానే ట‌క్కున క‌నిపెట్ట‌గ‌లిగే లోపం ఒక‌టుంది. అదే మ్యాచ్ విన్న‌ర్ లేక‌పోవ‌డం. గ‌త సీజ‌న్ వ‌ర‌కు జాస్ బ‌ట్ల‌ర్ రాయ‌ల్స్ త‌ర‌పున అద‌ర‌గొట్టాడు. అంత‌కు ముందు సీజ‌న్‌లో ఐతే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ఐతే ఈ

ఆర్సీబీ పాంచ్ ప‌టాకాఆర్సీబీ పాంచ్ ప‌టాకా

సొంత‌గ‌డ్డ‌పై ఓడిపోతున్న‌ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు..ప్ర‌త్య‌ర్థి వేదిక‌ల్లో చెల‌రేగి ఆడుతోంది. తాజాగా ముల‌న్‌పూర్‌లో పంజాబ్‌పై గెలిచి ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసింది. పంజాబ్ విసిరిన 158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో చేజ్ చేసింది. కేవ‌లం 3 వికెట్లే కోల్పోయి టార్గెట్

మూడొంద‌ల వీరుడు..చాన్స్ వ‌ద‌ల్లేదుమూడొంద‌ల వీరుడు..చాన్స్ వ‌ద‌ల్లేదు

క‌రుణ్ నాయ‌ర్‌, ఈ పేరు గుర్తుంది క‌దా..హార్డ్‌కోర్ టీమిండియా ఫ్యాన్స్‌కు కచ్చితంగా గుర్తుండిపోయే పోరు. ఎందుకంటే 2016లో టెస్టు అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచ‌రీ సాధించి ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఇండియ‌న్‌గా, ఓవ‌రాల్ క్రికెట్‌లో మూడో బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు.