వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు ఒక బ్యాడ్ న్యూస్..ఒక గుడ్ న్యూస్..కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. గైక్వాడ్ ఆడిన 5 మ్యాచుల్లో 122 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. గైక్వాడ్ కెప్టెన్సీ కంటే బ్యాటింగ్నే సీఎస్కే మిస్సవనుంది. గైక్వాడ్ స్థానంలో మహేంద్రసింగ్ ధోనిని కెప్టెన్గా నియమిస్తున్నట్టు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. కోల్కత నైట్రైడర్స్తో జరగబోయే మ్యాచ్ నుంచీ ధోని నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే 9 స్థానంలో ఉన్న చెన్నైని ధోని తన కెప్టెన్సీ మ్యాజిక్తో గట్టెక్కిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. చివరిసారిగా ధోని 2023 ఐపీఎల్లో కెప్టెన్సీ చేశాడు. ఆ సీజన్లో సీఎస్కేని ఛాంపియన్గా నిలిపాడు. ఆ తర్వాత 2024 ఐపీఎల్ సీజన్కు ముందే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా రుతురాజ్కు కెప్టెన్సీ ఇచ్చారు. గత సీజన్లో సీఎస్కే ప్లే ఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఇక ఈ సీజన్లోనూ టేబుల్లో బాటమ్లో ఉంది. మరి మాహీ మేనియా ఏం చేస్తుందో చూడాలి?
రుతురాజ్ ఔట్..కెప్టెన్గా ధోని

Related Post

ఇంటెంట్ ముఖ్యం బిగిలు ..ఇంటెంట్ ముఖ్యం బిగిలు ..
అదీ లెక్క..సన్రైజర్స్ కొడితే ఏనుగు కుంభస్థలమే..246 పరుగుల టార్గెట్..వీళ్ల ఆట ముందు చిన్నదైపోయింది. ఇక్కడ గెలుపోటముల ప్రస్థావన కాదు, లీగ్లో మరింత ముందుకెళతారో లేదో అనే లెక్కల గురించి కాదు, మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ల ఇంటెంట్ గురించి..ఆ ఇంటెంట్ గెలిచింది, గెలిపించింది.

రషీద్ వికెట్ తీశాడోచ్..రషీద్ వికెట్ తీశాడోచ్..
ఆఫ్గన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్..ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ తనుంటాడు. లెక్కలేనన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్లోనూ రషీద్ఖాన్కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ

ఫస్ట్ ఓవర్లోనే రెండు లైఫ్లుఫస్ట్ ఓవర్లోనే రెండు లైఫ్లు
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్కు మొదటి ఓవర్లోనే రెండు లైఫ్లు వచ్చాయి. తొలి ఓవర్ దీపక్ చాహర్ బౌలింగ్ చేయగా.. ఓపెనర్ అభిషేక్శర్మ తొలి బంతికే స్లిప్లో ఔట్ అవ్వాల్సింది, కాని