Cricket Josh IPL 6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య‌..ఇప్పుడు సెంచ‌రీ

6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య‌..ఇప్పుడు సెంచ‌రీ

6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య‌..ఇప్పుడు సెంచ‌రీ post thumbnail image

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు ప్రియాన్ష్ ఆర్య‌..సెంచ‌రీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇత‌డే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంత‌కీ ఎవ‌రీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్ అండ‌ర్‌-19లోనూ త‌న‌దైన మార్క్ చూపించాడు. 2021లో దేశ‌వాళీ టీ20లో అడుగుపెట్టిన ఆర్య‌, 2023లో లిస్ట్ ఏలో డెబ్యూ చేశాడు. రీసెంట్‌గా జ‌రిగిన ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు కొట్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.
ఇక ఐపీఎల్ వేలంలో ఇత‌డి కోసం ఫ్రాంచైజీలు పోటీప‌డ్డాయి. ఆ పోటీలో పంజాబ్ ఇత‌డిని ద‌క్కించుకుంది. రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో ఉన్న ఆర్య‌ను పంజాబ్ రూ.3.8 కోట్ల‌కు ద‌క్కించుకుంది.
ప్ర‌తీ పైసాకు లెక్క చెబుతూ..సీఎస్కేపై అత‌డి ఇన్నింగ్స్ సాగింది. న్యూ ఛండీగ‌ర్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో
చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై 39 బాల్స్‌లోనే సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఓపెన‌ర్‌గా వ‌చ్చి సీఎస్కే బౌల‌ర్ల‌ను ఆట‌డుకున్నాడు. మ‌రో ఎండ్‌లో వికెట్లు ప‌డుతున్నా స‌రే..త‌న దూకుడు పెంచాడే త‌ప్ప‌, త‌గ్గించ‌లేదు. ఆరో వికెట్‌కు శ‌శాంక్‌తో క‌లిసి 71 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. సెంచ‌రీ చేసిన త‌ర్వాత 103 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ప్రియాన్ష్ ఔట‌య్యాడు. నూర్ అహ్మ‌ద్ బౌలింగ్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి లాంగ్ ఆన్‌లో విజ‌య్ శంక‌ర్ క్యాచ్ ప‌ట్ట‌డంతో పెవిలియ‌న్ చేరాడు. ప్రియాన్ష్ డ‌గౌట్‌కు వెళుతున్న‌పుడు మిగ‌తా ప్లేయ‌ర్ల‌తో పాటు స్టేడియం అంతా చ‌ప్ప‌ట్ల‌తో అత‌డిని అభినందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTMనాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM

ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం

వేలంలో గాలం ఎవ‌రికి?వేలంలో గాలం ఎవ‌రికి?

ఐపీఎల్ మెగా వేలం న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజ‌ధాని రియాద్‌లో జ‌ర‌గ‌నున్న‌ద‌ని స‌మాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా న‌వంబ‌ర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడ‌నుంది. ఐతే

క‌ప్పు ముఖ్యం బిగిలు..క‌ప్పు ముఖ్యం బిగిలు..

ఈ న‌లుగురు యంగ్ ఇండియా కెప్టెన్స్‌..త‌మ త‌మ టీమ్స్‌ను ఐపీఎల్‌లో బ్ర‌హ్మాండంగా న‌డిపిస్తున్న తీరు చూస్తే..వీళ్ల‌లో ఒక‌రు క‌ప్పు కొట్ట‌డం గ్యారెంటీ అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్, గుజ‌రాత్ జెయింట్స్