సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ చూసినవాళ్లెవరైనా సరే..పిచ్ గురించే మాట్లాడుతారు. స్లో వికెట్ లాగా అనిపించినప్పటికీ, గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయిన చోట, సన్రైజర్స్ బ్యాటర్లు ఎందుకు తేలిపోయారు. సాయి కిశోర్ వంటి స్పిన్నర్ సత్తాచాటిన చోట..సన్రైజర్స్ స్పిన్నర్లు ఎందుకు చతికిలపడ్డారు. యంగ్స్టర్ జీషన్ అన్సారీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కమిందు మెండిస్ కూడా అంతే. ఏ రకంగా చూసిన ఈ పిచ్ గుజరాత్ టైటన్స్ కోసం చేసిన పిచ్లాగే ఉంది తప్పా..సన్రైజర్స్కు ఏ మాత్రం ఫేవరబుల్గా లేదు. హార్డ్కోర్ మేనేజ్మెంట్ ఫ్యాన్స్ మాత్రం కావాలనే పిచ్ను తమకు వ్యతిరేకంగా తయారు చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయని చెబుతున్నారు. కానీ ఈ వాదనలో ఏమాత్రం పసలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సన్రైజర్స్ అంతకు ముందు మూడు మ్యాచుల్లోనూ ఓడింది. ఫామ్లో లేని బ్యాటర్లు, పేలవంగా బౌలింగ్ చేస్తున్న బౌలర్లు..వెరసి ఓటమి పాలైంది. సరే అది నిజమే అనుకున్నా..ప్యాట్ కమిన్స్ ఎలాంటి బెదురు లేకుండా షాట్స్ ఎలా ఆడగలిగాడు..? పవర్ ప్లేలో సిమర్జిత్ ఓవర్ మినహాయిస్తే, మిగతా ఓవర్లన్నీ బాగా బౌలింగ్ ఎలా చేయగలిగారు? సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గినట్టు కనిపిస్తోంది. ఆటగాళ్లు కూడా మానసికంగా ధృడంగా కనిపించడం లేదు..అవి సెట్ చేసుకుంటే ఏ పిచ్ ఏమీ చేయలేదు..
టికెట్ల గొడవ..పిచ్ ఇష్యూకి కారణమా?

Categories:
Related Post

పవర్ ప్లే..దంచికొట్టారుపవర్ ప్లే..దంచికొట్టారు
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్నగుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ (82-0)ను నమోదు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ షమీ ఓవర్లో 5 ఫోర్లు, ఆ తర్వాత హర్షల్

రుతురాజ్ ఔట్..కెప్టెన్గా ధోనిరుతురాజ్ ఔట్..కెప్టెన్గా ధోని
వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు ఒక బ్యాడ్ న్యూస్..ఒక గుడ్ న్యూస్..కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. గైక్వాడ్ ఆడిన 5 మ్యాచుల్లో 122 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.

చెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చిందిచెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చింది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జట్ల మధ్య అంతకు ముందు చెన్నైలో మ్యాచ్ జరగగా..సీఎస్కే ముంబైని ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇలాఖా