వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్లో పరాభవం ఎదురైంది. గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 రన్స్ చేసింది. ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ నిరాశపరచగా…మిడిల్ ఆర్డర్లో లియామ్ లివింగ్స్టన్, జితేశ్ శర్మ ఆదుకున్నారు. లివింగ్స్టన్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో డేవిడ్ దూకుడుగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. గుజరాత్ టైటన్స్ 170 టార్గెట్ను ఆడుతు పాడుతూ చేజ్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 49 రన్స్ చేసి ఔటవగా..జాస్ బట్లర్ దుమ్మురేపాడు. 39 బాల్స్లో 73 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్లో రూథర్ఫోర్డ్ కూడా దూకుడుగా ఆడి 18 బాల్స్లో 30 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ ఇద్దరి ధాటికి గుజరాత్ మరో 13 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.
బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్

Related Post

సన్రైజర్స్ కి ‘షాన్’ దార్ వేటసన్రైజర్స్ కి ‘షాన్’ దార్ వేట
సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో తమ టైటిల్ వేటను ఓ రేంజ్లో మొదలుపెట్టింది. టీమ్లోకి ఈ సీజన్లోనే అడుగుపెట్టిన ఇషాన్ కిషన్..ఆడినతొలి మ్యాచ్లోనే సెంచరీతో దుమ్మురేపాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో సన్రైజర్స్ 286 పరుగుల భారీ స్కోర్ నమోదు

మూడొందల వీరుడు..చాన్స్ వదల్లేదుమూడొందల వీరుడు..చాన్స్ వదల్లేదు
కరుణ్ నాయర్, ఈ పేరు గుర్తుంది కదా..హార్డ్కోర్ టీమిండియా ఫ్యాన్స్కు కచ్చితంగా గుర్తుండిపోయే పోరు. ఎందుకంటే 2016లో టెస్టు అరంగేట్రం మ్యాచ్లోనే ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా, ఓవరాల్ క్రికెట్లో మూడో బ్యాటర్గా రికార్డులకెక్కాడు.

సన్రైజర్స్కు ఆ ముచ్చట తీరేనా?సన్రైజర్స్కు ఆ ముచ్చట తీరేనా?
చెన్నైకి ఎమ్ఎస్ ధోనిలాగా, ఆర్సీబీకి విరాట్ కోహ్లీలాగా, ముంబైకి రోహిత్శర్మలాగా, రాజస్థాన్కు సంజూ శాంసన్ లాగా, ఇలా ఇండియాకు ఆడిన, ఆడుతున్న సూపర్స్టార్ ప్లేయర్స్ ఎవరైనా ఒకరు సన్రైజర్స్కూ ఉంటే బాగుండని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. కానీ సన్రైజర్స్ ఎక్కువగా ఫారిన్