Cricket Josh IPL నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM

నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM

నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM post thumbnail image

ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే.. నాలుగు మ్యాచ్‌లలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. కోల్‌కతా వేదికగా కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ జరగ్గా.. ఆర్సీబీ తరఫున కృనాల్ పాండ్య తొలి మ్యాచ్ ఆడాడు. గతంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన కృనాల్‌ను ఈ ఏడాది మెగా వేలంలో ఆర్సీబీ రూ.5.75 కోట్లకు దక్కించుకుంది. బ్యాటింగ్‌లో అవకాశం రాకపోయినా బౌలింగ్‌లో కృనాల్ రాణించాడు. 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి కేకేఆర్ స్కోరును నియంత్రించాడు. దీంతో మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్‌హెచ్-ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్‌గా రాణించిన ఇషాన్‌ను ఈ ఏడాది మెగావేలంలో హైదరాబాద్ జట్టు రూ.11.25 కోట్లకు దక్కించుకుంది. అభిషేక్, హెడ్ లాంటి విధ్వంసక ఓపెనర్లు ఉండటంతో వన్‌డౌన్‌లో ఇషాన్ వెళ్లాల్సి వచ్చింది. అయినా తగ్గేదే లే అంటూ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసి ఔరా అనిపించాడు. 47 బాల్స్‌లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 రన్స్‌తో అజేయంగా నిలిచి తన జట్టుకు 286 పరుగుల భారీ స్కోరు అందించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.
మరోవైపు చెన్నై వేదికగా CSK-MI మధ్య జరిగిన మ్యాచ్ కూడా అభిమానులను అలరించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన ఈ ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ ఈ ఏడాది మెగా వేలంలో చెన్నై జట్టుకు వచ్చాడు. రూ. 10 కోట్లకు CSK అతడిని సొంతం చేసుకుంది.

ఇక విశాఖ వేదికగా DC-LSG మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారింది. ఇందులోనూ అరంగేట్ర ఆటగాడు రాణించాడు. అతడే అశుతోష్ శర్మ. గతంలో పంజాబ్ కింగ్స్ తరఫున సంచలన ఇన్నింగ్స్‌లను ఆడిన అనుభవం ఉంది. ఈ ఏడాది మెగా వేలంలో అతడిని ఢిల్లీ రూ.3.8 కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అశుతోష్ విశాఖ మ్యాచ్‌లో ఓటమి అంచుల్లో ఉన్న తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. 210 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో తన జట్టు 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా ఏ మాత్రం బెదరకుండా ఆడిన అశుతోష్ 31 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 రన్స్ చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

బెస్ట్ ముంబైకి..హైయెస్ట్ స‌న్‌రైజ‌ర్స్‌కిబెస్ట్ ముంబైకి..హైయెస్ట్ స‌న్‌రైజ‌ర్స్‌కి

క‌ర్ణ్‌శ‌ర్మ‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై అద్భుత‌మైన బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చి అస‌లైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 204 ప‌రుగుల టార్గెట్‌ ఛేజింగ్ వైపు దూసుకెళ్తున్న ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. అభిషేక్ పొరెల్,

GT..యూ బ్యూటీGT..యూ బ్యూటీ

ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైట‌న్స్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఓడించి విజ‌యాల సిక్స‌ర్ కొట్టింది. 12 పాయింట్ల‌తో టేబుల్‌లో టాప్ పొజిష‌న్‌లో కొన‌సాగుతోంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్‌కు మిస్ట‌ర్ క‌న్సిస్టెంట్ సాయి సుద‌ర్శ‌న్, కెప్టెన్

విజిల్ మోగ‌ట్లే..విజిల్ మోగ‌ట్లే..

చెన్నై సూప‌ర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన టీమ్‌..ఈ సీజ‌న్‌లో నాసిర‌కం ఆట‌తీరు క‌న‌బ‌రుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఓట‌మిపాలైంది. హోమ్ గ్రౌండ్‌ చెపాక్‌లో చెన్నై చేతులెత్తేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల న‌ష్టానికి