కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఖండించారు. సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ కోసం టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తమ టీమ్స్, యావత్ భారత్ మొత్తం ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతోందని…వారి కుటుంబాలకు అండగా ఉండాలని వారు చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులు 28 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా దీనిపై దేశమంతా రగిలిపోతోంది.ఇటువంటి సమయంలో ప్రజలంతా శాంతి కోరుకోవాలని, మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇరుజట్ల ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్లు ధరించి వారి సానుభూతి ప్రకటించుకున్నారు. నిమిషం పాటు మౌనం పాటించారు.
ఉగ్రదాడిని ఖండించిన ముంబై, సన్రైజర్స్

Related Post

వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?
సన్రైజర్స్ హైదరాబాద్ డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల హెడ్ ఆసీస్కు పయనమయ్యే చాన్స్ ఉంది. ఒకవేళ హెడ్ రాబోయే మ్యాచ్లకు మిస్సైతే సన్రైజర్స్కు కోలుకోలేని దెబ్బపడినట్టే. ఇప్పటికే ఆడిన మూడు

వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..
మొత్తానికి కొన్ని గంటలుగా బెంగళూరులో కురుస్తున్న వర్షం ఆగిపోయింది. తొమ్మిదిన్నరకు టాస్ వేయగా..పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో వరుసగా మూడోసారి మొదట బ్యాటింగ్ చేయబోతోంది. రెండు సార్లు మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది.

రైజర్స్ ఫాలింగ్..రైజర్స్ ఫాలింగ్..
సన్రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 5వ ఓటమి. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసింది. పిచ్ స్లోగా ఉండటం, హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి కాస్త కలిసొచ్చినప్పటికీ…సన్రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. ముంబై బౌలర్లు పక్కా ప్లానింగ్తో సన్రైజర్స్ బ్యాటర్లను