ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. ఈ స్లో పిచ్పై సన్రైజర్స్ బ్యాటర్లు షాట్లు కొట్టేందుకు తెగ ఇబ్బంది పడ్డారు. దానికి కారణం స్లో పిచ్. పవర్ ప్లేలో అభిషేక్, హెడ్ ఎంత ట్రై చేసినా..సిక్సర్లు కొట్టలేకపోయారు. ఇక మిడిల్ ఓవర్స్లోనూ నితీశ్కుమార్రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ శాయశక్తులా ప్రయత్నించినా దక్కలేదు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో క్లాసెన్ సిక్సర్ కొట్టాడు..అదే ఓవర్లో రెండు సిక్స్లు, రెండు ఫోర్లు, ఒక సింగిల్తో 21 రన్స్ రాబట్టుకున్నాడు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఇదే బెస్ట్ ఓవర్. చివర్లో అనికేత్, రెండు సిక్సర్లు..ఇన్నింగ్స్ లాస్ట్ బాల్కు కెప్టెన్ కమిన్స్ ఒక సిక్స్ కొట్టడంతో సన్రైజర్స్ గౌరవప్రదమైన స్కోరును చేరుకుంది. అభిషేక్ 40 రన్స్తో టాప్ స్కోరర్గా ఉన్నాడు. క్లాసెన్ 37, హెడ్ 28 రన్స్ సాధించారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2 వికెట్లు తీయగా, బుమ్రా, హార్దిక్, బౌల్ట్కు తలా ఒక వికెట్ దక్కింది.
ఇదేం పిచ్రా బాబు..18వ ఓవర్లో తొలి సిక్స్

Related Post

6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య..సెంచరీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇతడే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతకీ ఎవరీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండర్-19లోనూ తనదైన మార్క్ చూపించాడు. 2021లో దేశవాళీ టీ20లో

కప్పు ముఖ్యం బిగిలు..కప్పు ముఖ్యం బిగిలు..
ఈ నలుగురు యంగ్ ఇండియా కెప్టెన్స్..తమ తమ టీమ్స్ను ఐపీఎల్లో బ్రహ్మాండంగా నడిపిస్తున్న తీరు చూస్తే..వీళ్లలో ఒకరు కప్పు కొట్టడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ జెయింట్స్

ధోని వర్సెస్ కోహ్లీ..? కానే కాదుధోని వర్సెస్ కోహ్లీ..? కానే కాదు
టీమిండియా లెజెండ్స్ మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందా? అంటే కానే కాదు..ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్..జస్ట్ గేమ్ను ఆస్వాదిస్తారంతే. ఇది ఓన్లీ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీగానే చూడాలి. ముఖ్యంగా ధోని ఐపీఎల్లో తప్ప ఇంకెక్కడా ఆడటం లేదు..