కోల్కత నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 20 బంతుల్లో 39 రన్స్ జోడించిన తర్వాత ప్రియాన్ష్ ఆర్యను కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఔట్ చేశాడు. ఇక అదే ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ను కూడా ఔట్ చేసి డబుల్ ఇంపాక్ట్ చూపించాడు హర్షిత్ రాణా. ఆ మరుసటి ఓవర్లోనే జాష్ ఇంగ్లిస్ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. ఇక పవర్ ప్లే ఆఖరి బంతికి ఊపుమీదున్న ప్రభ్సిమ్రన్సింగ్ను కూడా హర్షిత్ ఔట్ చేసి పంజాబ్ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో పంజాబ్ 54 రన్స్కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వధేరా, యాన్సెన్ కొన్ని రన్స్ జోడించినప్పటికీ వికెట్ల పతనం ఆగకపోవడంతో పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో 2 వికెట్లు తీశారు.
కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్

Related Post

స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?స్ట్రాటెజీ మారుస్తారా..? తగ్గేదేలే అంటారా?
వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై..ప్లే ఆఫ్ దారిని ఇబ్బందికరంగా మార్చుకుంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ మేల్కోవాల్సిన టైమ్ ఇది. గుజరాత్ టైటన్స్తో సొంతగడ్డపై జరగబోయే మ్యాచ్లో విజయం సాధించి మళ్లీ గాడిలో పడాల్సిందే. ట్రావిస్ హెడ్ మినహా మిగతా టాపార్డర్ విఫలమవుతోంది. ఓపెనర్

లెటర్ ఉందా? చెక్ చేసిన సూర్యలెటర్ ఉందా? చెక్ చేసిన సూర్య
ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మడమ కాస్త ట్విస్ట్ అవడంతో..ఓవర్ మధ్యలో బ్రేక్ దొరికింది. అదే టైమ్లో సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ అభిషేక్శర్మ దగ్గరికి వెళ్లి అతడి

పటేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్పటేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు ఫిల్సాల్ట్, విరాట్ కోహ్లీ. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ రెండో ఓవర్లోనే బౌలింగ్కు దిగాడు. ఐనప్పటికీ స్కోర్ వేగం తగ్గలేదు. ముఖ్యంగా