చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థలా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ద ఫినిషర్ అనే ట్యాగ్ లైన్ను మళ్లీ గుర్తు చేశాడు. 167 పరుగుల టార్గెట్ను చెన్నై ఛేదించే క్రమంలో మ్యాచ్ ఒకదశలో లక్నోవైపు ఉందన్నట్టు అనిపించింది. ఒక ఎండ్లో శివమ్ దూబె తన సహజ శైలికి విరుద్ధంగా మెల్లగా ఆడుతున్నాడు. అదే టైమ్లో ధోని ఎంటరయ్యాడు. అప్పుడు గెలుపు ఈక్వేషన్ 30 బాల్స్లో 56 రన్స్ కావాలి. ధోని తొలి బాల్కి సింగిల్ తీసి..ఆ తర్వాత బాల్ నుంచి బౌండరీల కౌంట్ మొదలెట్టాడు. చివరి 12 బాల్స్లో 24 రన్స్కు ఈక్వేషన్ మారింది. దూబె 4, 6 కొట్టగా…అదే ఓవర్ను ధోని ఫోర్తో ముగించాడు. ఇక ఆరు బాల్స్లో 5 రన్స్ అవసరమయ్యాయి. గెలుపు సీఎస్కేకు సునాయసంగా చిక్కింది. ధోని 11 బాల్స్లో 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక శివమ్ దూబె 37 బాల్స్లో 43 రన్స్తో నాటౌట్గా ఉన్నాడు. ఇతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
ధోని..ద ఫినిషర్..అంతే

Related Post

ఈ సాలా కప్..బోణీ కొట్టారుఈ సాలా కప్..బోణీ కొట్టారు
ఐపీఎల్లో మోస్ట్ అన్లక్కీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ఈసారైనా తమ లక్ పరీక్షించుకునేందుకు తొలి అడుగు గట్టిగానే వేసింది. ఏకంగా గత సీజన్ ఛాంపియన్ కోల్కత నైట్రైడర్స్ను ఓడించి సీజన్కు శుభారంభం చేసింది. ద కింగ్..విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి

వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే

నాలుగు మ్యాచ్లు.. డెబ్యూలోనే POTMనాలుగు మ్యాచ్లు.. డెబ్యూలోనే POTM
ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు జరగ్గా.. అన్ని మ్యాచ్లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం