గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ హిమ్మత్ సింగ్ను రంగంలోకి దింపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్కు దూరమైన ఓపెనర్ మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ను లక్నో సూపర్ జెయింట్స్ ఆక్షన్లో హిమ్మత్సింగ్ను రూ.30 లక్షలకు దక్కించుకుంది. హిమ్మత్ గతేడాది చివర్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పెద్దగా రాణించకపోయినప్పటికీ..ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో అతని ప్రతిభకు పట్టం కట్టారని చెప్పొచ్చు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో కెప్టెన్గా అదరగొట్టి ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ రైడర్ జట్టుకు ట్రోఫీ అందించాడు. అంతేకాదు ఈ లీగ్లో ఎక్కువ రన్స్ సాధించిన లిస్ట్లో మూడో స్థానంలో ఉన్నాడు. పది మ్యాచుల్లో 381 రన్స్ చేయగా, అందులో 4 హాఫ్ సెంచరీలున్నాయి. స్ట్రైక్ రేట్ 165 కంటే ఎక్కువగా ఉండటం ప్లస్ పాయింట్. మరి లక్నో సూపర్ జెయిట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఢిల్లీ బాయ్ కదా..కొంచెం ఆట, కొంచెం లోకల్ సెంటిమెంట్ కూడా ఉండొచ్చేమో మరి..తప్పు లేదులే.
ఎవరీ హిమ్మత్ సింగ్..?

Related Post

మూడొందల వీరుడు..చాన్స్ వదల్లేదుమూడొందల వీరుడు..చాన్స్ వదల్లేదు
కరుణ్ నాయర్, ఈ పేరు గుర్తుంది కదా..హార్డ్కోర్ టీమిండియా ఫ్యాన్స్కు కచ్చితంగా గుర్తుండిపోయే పోరు. ఎందుకంటే 2016లో టెస్టు అరంగేట్రం మ్యాచ్లోనే ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా, ఓవరాల్ క్రికెట్లో మూడో బ్యాటర్గా రికార్డులకెక్కాడు.

మాజీ టీమ్పై..క్లాసికల్ విధ్వంసంమాజీ టీమ్పై..క్లాసికల్ విధ్వంసం
మాజీ టీమ్పై ఇరగదీయడం అనే ట్రెండ్ ఐపీఎల్లో కంటిన్యూ అవుతోంది. తాజాగా కేఎల్ రాహుల్, ఆర్సీబీ మాజీ ఆటగాడు..ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న ఈ క్లాసీ ప్లేయర్..ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. 164 పరుగుల టార్గెట్ను ఛేదిండంలో

మామను మిస్ చేసుకోవద్దుమామను మిస్ చేసుకోవద్దు
ఐపీఎల్ మెగా ఆక్షన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఏడెన్ మార్క్రమ్ కూడా ఉన్నాడు. తెలుగు అభిమానులు ముద్దుగా మార్క్రమ్ మామ అని పిలుచుకునే ఈ సౌతాఫ్రికా కెప్టెన్..బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టాడు. మంచి రికార్డ్ ఉన్న ఇతడిని సన్రైజర్స్