క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు..ఒక క్యాచ్ వదిలేస్తే, అంది ఎంత కాస్ట్లీ అవుతుందనేది మనం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఆ విషయం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పతిదార్కు బాగా అర్థమై, అనుభవమై ఉంటుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో వికెట్ కోల్పోయే అవకాశాన్ని పతిదార్ చేజేతులా తోసిపుచ్చాడు. కేఎల్ రాహుల్ 5 పరుగుల మీద ఉన్నపుడు ఇచ్చిన క్యాచ్ను రజత్ పతిదార్ జారవిడిచాడు. అక్కడ లైఫ్ పొందిన రాహుల్ మళ్లీ తప్పు చేయలేదు. నిలకడగా ఆడుతూ ఒకేసారి వేగం పెంచాడు. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత జాస్ హేజిల్వుడ్ ఓవర్లో ఏకంగా 22 రన్స్ బాదాడు. దీంతో ఢిల్లీ టార్గెట్ వైపు మరింత వేగంగా దూసుకెళ్లింది. రాహుల్ 53 బాల్స్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో రెచ్చిపోయి 93 పరుగులతో నాటౌట్గా నిలిచి ఢిల్లీని గెలిపించాడు. ఒకవేళ రాహుల్ 5 పరుగుల వద్దే ఔటై ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మ్యాచ్ అనంతరం రజత్ ఈ విషయమై బాధ పడినప్పటికీ, ఆటలో ఇవన్నీ సహజమే గనుక..మరో మ్యాచ్కు ఫ్రెష్గా సిద్ధమవ్వాల్సిందే.
ఆర్సీబీ కెప్టెనే మ్యాచ్ను వదిలేశాడు

Related Post

6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ6 బంతుల్లో 6 సిక్స్ల ఆర్య..ఇప్పుడు సెంచరీ
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య..సెంచరీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇతడే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతకీ ఎవరీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండర్-19లోనూ తనదైన మార్క్ చూపించాడు. 2021లో దేశవాళీ టీ20లో

అయ్యో..ఫిలిప్స్అయ్యో..ఫిలిప్స్
గ్లెన్ ఫిలిప్స్..ధనాధనా సిక్సర్లు కొట్టమంటే, సిక్సర్లు కొడతాడు. స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయమంటే వికెట్లు తీస్తాడు, కనీసం బ్యాటర్లను కట్టడైనా చేస్తాడు..క్యాచ్లు పట్టుకోవాలంటే నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్లు పట్టుకుంటాడు. ఫిల్డింగ్ చేసి రన్స్ ఆపాలంటే డైవ్ చేసి మరి

వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..
మొత్తానికి కొన్ని గంటలుగా బెంగళూరులో కురుస్తున్న వర్షం ఆగిపోయింది. తొమ్మిదిన్నరకు టాస్ వేయగా..పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో వరుసగా మూడోసారి మొదట బ్యాటింగ్ చేయబోతోంది. రెండు సార్లు మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది.