ఈ సీజన్లో నికోలస్ పూరన్, విరాట్ కోహ్లీ, మిచెల్ మార్ష్…ఇలా మాంచి హిట్టర్ల గురించే మాట్లాడుకుంటున్నాం గానీ..వీళ్లకు ఏ మాత్రం తీసిపోని మరో ప్లేయర్ గురించి కాస్త తక్కువగానే మాట్లాడుకుంటున్నాం. అతడే మిస్టర్ కన్సిస్టెంట్, అసాధారణ ప్రతిభ ఉన్న బ్యాటర్ సాయి సుదర్శన్. చాపకింద నీరులా తనపని తాను చేసుకుపోతూ హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచుల్లో..వరుసగా 74, 63, 49, 5, 82 రన్స్ చేశాడు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్, అందుకే అండర్ రేటెడ్ ప్లేయర్గా నిలుస్తున్నాడు. కానీ తానేంటో బ్యాట్తోనే సమాధానం చెబుతున్నాడు. మ్యాచ్ మ్యాచ్కూ రాటుదేలుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఈ యంగ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రెండో వికెట్కు బట్లర్తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం, మూడో వికెట్కు షారుక్తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. గుజరాత్ రెండొందలకు పైగా (217) స్కోరు సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు.
ఈ కుర్రాణ్ని మీరు గమనించట్లే గానీ..

Related Post

నాలుగు మ్యాచ్లు.. డెబ్యూలోనే POTMనాలుగు మ్యాచ్లు.. డెబ్యూలోనే POTM
ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు జరగ్గా.. అన్ని మ్యాచ్లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం

కప్పు ముఖ్యం బిగిలు..కప్పు ముఖ్యం బిగిలు..
ఈ నలుగురు యంగ్ ఇండియా కెప్టెన్స్..తమ తమ టీమ్స్ను ఐపీఎల్లో బ్రహ్మాండంగా నడిపిస్తున్న తీరు చూస్తే..వీళ్లలో ఒకరు కప్పు కొట్టడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ జెయింట్స్

కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?
ఈ సీజన్ ఐపీఎల్లో కొత్త కుర్రాళ్ల హవా కొనసాగుతోంది. అరంగేట్రంలోనే అదరగొడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వీళ్లలో ముఖ్యంగా దిగ్వేశ్ రాఠీ , విఘ్నేష్ పుతుర్, జీషన్ అన్సారి, అశ్వనీ కుమార్ ఉన్నారు. దిగ్వేశ్ రాఠీ, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఢిల్లీ