Cricket Josh IPL భారీ థ్రిల్ల‌ర్‌లో ల‌క్నోదే ల‌క్

భారీ థ్రిల్ల‌ర్‌లో ల‌క్నోదే ల‌క్

భారీ థ్రిల్ల‌ర్‌లో ల‌క్నోదే ల‌క్ post thumbnail image

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బౌండ‌రీల వ‌ర్షం కురిసింది.ప‌రుగుల వ‌ర‌ద పారింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌లో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచ‌రీ (81) తో దుమ్మురేప‌గా, విధ్వంస ప్రేమికుడు నికోల‌స్ పూర‌న్ కేకేఆర్ బౌల‌ర్ల‌పై సునామీలా విరుచుకుప‌డ్డాడు. 36 బాల్స్‌లో 84 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 8 సిక్స‌ర్లు ఉన్నాయి. దీంతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 20 ఓవర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 238 ర‌న్స్ చేసింది.
239 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో కేకేఆర్‌కు ప‌వ‌ర్‌ప్లేలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ డికాక్ ఔట‌వ‌గా..ఆ త‌ర్వాత కెప్టెన్ ర‌హానే, వెంక‌టేశ్ అయ్య‌ర్ దూకుడుగా ఆడి గెలుపుపై ఆశ‌లు నింపారు. ర‌హానే 35 బాల్స్‌లో 61 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి. వెంక‌టేశ్ అయ్య‌ర్ 45 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. ఈ ఇద్ద‌రూ ఔటైన త‌ర్వాత కేకేఆర్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. చివ‌రి ఓవ‌ర్‌లో 6 బాల్స్‌లో 24 ర‌న్స్ కావాలి. ఈ ద‌శ‌లో క్రీజులో రింకూ సింగ్, బౌలింగ్‌లో ర‌వి బిష్ణోయ్ ఉన్నారు. ఐతే బిష్ణోయ్ 19 ర‌న్స్ ఇచ్చి కేకేఆర్ గెలుపును దూరం చేశాడు. దీంతో ల‌క్నో 4 ప‌రుగుల తేడాతో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

న‌లుగురి ఆడిష‌న్ సౌతాఫ్రికాలో..న‌లుగురి ఆడిష‌న్ సౌతాఫ్రికాలో..

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా ఆట‌గాళ్ల‌లో న‌లుగురు త‌ప్ప మిగ‌తా వాళ్లంతా ఏదో ఒక ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న వాళ్లే…ఐతే ఆ న‌లుగురు ఇప్పుడు సౌతాఫ్రికాతో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్‌లో స‌త్తాచాటితే ఇటు ఇండియాకు మేలు, అటు వాళ్ల‌కు ఆక్ష‌న్‌లో మంచి

రివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలేరివేంజ్ కాదు..రేంజ్ స‌రిపోలే

గ‌త సీజ‌న్‌లో మూడుసార్లు కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..ఈ సీజ‌న్‌లోనూ కేకేఆర్ చేతిలో చిత్తైంది. గ‌త ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటుంది అనుకుంటే..త‌మ రేంజ్ స‌రిపోలేదంటూ మ‌రోసారి ఓడిపోయింది. బౌల‌ర్లు మ‌రోసారి నిరాశ‌ప‌రుస్తూ ప్రత్య‌ర్థి కేకేఆర్‌కు 200 ర‌న్స్ స‌మ‌ర్పించుకున్నారు.

మ‌ళ్లీ త‌క్కువకే..పంజాబ్ గెలిచిందిమ‌ళ్లీ త‌క్కువకే..పంజాబ్ గెలిచింది

పంజాబ్ కింగ్స్‌కు వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ లో స్కోరింగ్ ఎన్‌కౌంట‌ర్‌ను చ‌విచూసింది. గ‌త మ్యాచ్‌లో కేకేఆర్‌పై 111 ర‌న్స్ డిఫెండ్ చేసుకున్న పంజాబ్…ఈసారి ఆర్సీబీపై 96 ర‌న్స్‌ను కొంచెం క‌ష్టం..కొంచెం ఇష్టంగానే చేజ్ చేసింది. నెహాల్ వ‌ధేరా (19 బాల్స్‌లో 33*,