ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్..ప్రత్యర్థులకు ఇచ్చిపడేస్తున్నడు. తన మాజీ టీమ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీసి సత్తాచాటాడు. తను ఏడు సీజన్లపాటు ఆడిన టీమ్పై..అది కూడా చిన్నస్వామి స్టేడియంలో..ఆ వైబ్, ఆ స్వాగ్ మామూలుగా లేదు. ముఖ్యంగా ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ను ఔట్ చేసిన విధానం అదుర్స్..సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతికి సాల్ట్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత నాలుగో బంతికి సిరాజ్ అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. సాల్ట్, సిరాజ్ మధ్య నిశ్శబ్ద యుద్ధమే జరిగింది. సాల్ట్ వికెట్తో పాటు దేవ్దత్ పడిక్కల్, హాఫ్ సెంచరీ హీరో లియామ్ లివింగ్స్టన్ వికెట్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు సిరాజ్. ఇక సోషల్ మీడియాలో ఆర్సీబీని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మెగా ఆక్షన్కు ముందు సిరాజ్ను రిటైన్ చేసుకోకపోవడంపై ఆర్సీబీ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత ఆక్షన్లోనూ సిరాజ్ కోసం వెళ్లనేలేదు. ఆక్షన్లో గుజరాత్ టైటన్స్ సిరాజ్ను రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో వికెట్లేమీ తీయని సిరాజ్..ఆ తర్వాత రెండు మ్యాచుల్లో కలిపి 5 వికెట్లు సాధించాడు. 2017లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడాడు. ఆ తర్వాత 2018 నుంచి 2015 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కే ఆడాడు. ఇప్పుడు అదే టీమ్పై ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్తో ఇచ్చిపడేసి ఈ సీజన్లో ఓటమి రుచి చూపించాడు.
అట్లుంటది సిరాజ్తోని..

Categories:
Related Post

బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్
వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్లో పరాభవం ఎదురైంది. గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 రన్స్ చేసింది. ఓపెనర్లు

క్రికెట్లో ఈ బ్రహ్మాస్త్రానికి తిరుగు లేదా..?క్రికెట్లో ఈ బ్రహ్మాస్త్రానికి తిరుగు లేదా..?
డర్ కె ఆగే జీత్ హై..అనేది యాడ్స్లో వింటుంటాం, చూస్తుంటాం. అంటే భయాన్ని దాటితేనే గెలుపు అని అర్థం. ఐతే ప్రస్తుత ఐపీఎల్ పరిభాషలో దీన్ని చెప్పాలంటే…యార్కర్ కె ఆగే జీత్ హై..అంటే యార్కర్స్ను బ్యాటర్లు అధిగమిస్తేనే తమ టీమ్ను గెలిపించగలరు,

వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్
ఐపీఎల్లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంతకు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట