Cricket Josh IPL ఇప్పుడు పీట‌ర్స‌న్‌..అస‌లు రీజ‌న్ ధావ‌న్‌

ఇప్పుడు పీట‌ర్స‌న్‌..అస‌లు రీజ‌న్ ధావ‌న్‌

ఇప్పుడు పీట‌ర్స‌న్‌..అస‌లు రీజ‌న్ ధావ‌న్‌ post thumbnail image

అశుతోష్ శ‌ర్మ..పంజాబ్ కింగ్స్‌ను గెలిపించిన హీరో. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై హీరోచిత ఇన్నింగ్స్ ఆడి 210 ప‌రుగుల టార్గెట్‌ను చేదించ‌డంలో కీ రోల్ ప్లే చేశాడు ఈ యంగ్‌స్ట‌ర్. ఐతే మ్యాచ్ గెలిపించిన త‌ర్వాత అత‌డు స్విచ్ హిట్ కొట్టిన‌ట్టు సెల‌బ్రేట్ చేస్తూ..పంజాబ్ మెంటార్ కెవిన్ పీట‌ర్స‌న్‌కు థాంక్స్ చెప్పాడు. దీంతో అశుతోష్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన‌ క్రెడిట్ అంతా పీట‌ర్స‌న్‌దే అని చాలా మంది అనుకున్నారు. కానీ తెర‌వెన‌క ఉన్న‌ది టీమిండియా లెజెండ్ శిఖ‌ర్ ధావ‌న్. ఈ విష‌యాన్ని ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుంటున్న స‌మ‌యంలో అశుతోష్ స్వ‌యంగా చెప్పాడు. తన స‌క్సెస్ కు కార‌ణం శిఖ‌ర్ ధావ‌న్ అని, అత‌డి థాంక్స్ చెప్పాల‌నుకుంటున్న‌ట్టు తెలిపాడు. ఆ త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న అశుతోష్‌కు శిఖ‌ర్ ధావ‌న్ నుంచి వీడియో కాల్ వ‌చ్చింద‌ని..ధావ‌న్‌, అశుతోష్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశాడు. ఈ విష‌యాన్ని వెంట‌నే అశుతోష్ త‌న టీమ్‌మేట్స్‌కు చూపిస్తూ సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

నిజానికి 2024 ఐపీఎల్ (సీజ‌న్‌కు ముందే) ప్రీ సీజ‌న్ క్యాంప్‌లో ధావ‌న్‌ను అశుతోష్ క‌లిశాడు. అప్పుడే అశుతోష్ టాలెంట్‌పై ఒక అభిప్రాయానికొచ్చిన ధావ‌న్ అత‌డిని ఎంక‌రేజ్ చేశాడు. ఆట‌కు ముందే ఎలా ఆడాలో అనేది విజువ‌లైజ్ చేసుకోవాలంటూ స‌ల‌హాలూ ఇచ్చాడు. ధావ‌న్ త‌న బ్యాట్‌ను అశుతోష్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బ్యాట్‌తోనే అశుతోష్ రంజీ అరంగేట్రంలో గుజ‌రాత్‌పై సెంచ‌రీ చేశాడు. అప్ప‌టి నుంచి ఈ యంగ్‌స్ట‌ర్ ధావ‌న్‌తో రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉంటూ స‌ల‌హాలు సూచ‌న‌లూ తీసుకుంటున్నాడు. అదీ మ్యాట‌రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

స‌న్‌రైజ‌ర్స్‌కు ఆ ముచ్చ‌ట తీరేనా?స‌న్‌రైజ‌ర్స్‌కు ఆ ముచ్చ‌ట తీరేనా?

చెన్నైకి ఎమ్ఎస్ ధోనిలాగా, ఆర్సీబీకి విరాట్ కోహ్లీలాగా, ముంబైకి రోహిత్‌శ‌ర్మ‌లాగా, రాజ‌స్థాన్‌కు సంజూ శాంస‌న్ లాగా, ఇలా ఇండియాకు ఆడిన‌, ఆడుతున్న సూప‌ర్‌స్టార్ ప్లేయ‌ర్స్ ఎవ‌రైనా ఒక‌రు స‌న్‌రైజ‌ర్స్‌కూ ఉంటే బాగుండ‌ని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. కానీ స‌న్‌రైజ‌ర్స్ ఎక్కువ‌గా ఫారిన్

వేదిక ఫిక్స్‌, డేట్స్‌ ఫిక్స్‌.. జెడ్డాలోవేదిక ఫిక్స్‌, డేట్స్‌ ఫిక్స్‌.. జెడ్డాలో

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్ న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో నిర్వ‌హిస్తున్న‌ట్టు బీసీసీఐ తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఈవెంట్ జ‌రుగుతుంద‌ని, వేదిక‌ను కూడా ఖ‌రారు చేసింది. ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేయ‌గా, ఇప్పుడు జెడ్డాకు

6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య‌..ఇప్పుడు సెంచ‌రీ6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య‌..ఇప్పుడు సెంచ‌రీ

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు ప్రియాన్ష్ ఆర్య‌..సెంచ‌రీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇత‌డే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంత‌కీ ఎవ‌రీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్ అండ‌ర్‌-19లోనూ త‌న‌దైన మార్క్ చూపించాడు. 2021లో దేశ‌వాళీ టీ20లో